HomeTelugu Newsసరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు

సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు

6 23భారత స్టార్‌ షట్లర్‌, తెలుగు తేజం పీవీ సింధు సరికొత్త చరిత్ర సృష్టించింది. ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్స్‌లో జపాన్‌ క్రీడాకారిణి ఒకుహరపై 21-7, 21-7 తేడాతో ఘనవిజయం సాధించింది.

తొలి రౌండ్‌లో అదరగొట్టిన పీవీ సింధు రెండో రౌండ్‌లోనూ దూసుకెళ్లింది. రెండో గేమ్‌లోనూ ఆదినుంచే పాయింట్లు సాధిస్తూ ఒకుహరపై పైచేయి సాధించింది. 2వ పాయింట్‌ నుంచి 9 పాయింట్ల వరకు వరుసగా చెలరేగింది. మధ్యలో ఒకుహర రెండు పాయింట్లు సాధించినా సింధూ మళ్లీ జోరు కొనసాగించింది. విరామానికి 11-4తో అదరగొట్టింది. ఆ తర్వాత కూడా అదే జోరు కొనసాగించి 21-7తో విజేతగా నిలిచింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu