యంగ్ హీరో రాజ్ తరుణ్, షాలినీ పాండే జంటగా నటించిన సినిమా ‘ఇద్దరి లోకం ఒకటే’. జీఆర్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. దిల్రాజు సమర్పిస్తున్నారు. టర్కిష్ సినిమా ‘లవ్ లైక్స్ కో ఇన్సిడెన్సెస్’ ఆధారంగా ప్రేమకథతో తీసిన ఈ సినిమా డిసెంబరు 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా ట్రైలర్ను మంగళవారం సాయంత్రం విడుదల చేశారు. రాజ్ తరుణ్, షాలినీ మధ్య ప్రేమ, భావోద్వేగాలు ప్రధానాంశంగా ఈ చిత్రాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది.
బాల్యంలో షాలినీని ఇష్టపడ్డ రాజ్తరుణ్ ఆమె కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తుంటాడు. చివరికి ఆమె కంటపడతారు. ‘నువ్వు వచ్చావ్.. నా లైఫ్ఫే టర్న్ అయిపోయింది’ అని షాలినీ తెగ సంబరపడిపోతుంటారు. ‘ఒక మనిషి కావాలి అనుకోవడానికి బయటికి కనిపించే ఒక్క ఫీలింగ్ సరిపోతుంది. కానీ వద్దు అనుకోవడానికి బయటికి కనిపించని వంద కారణాలు కావాలి’ అని ట్రైలర్లో రాజ్ తరుణ్ బాధపడుతూ కనిపించారు.
Guysssss!! Here’s the theatrical trailer of #IddariLokamOkate
Hope u like it!! 😃https://t.co/zHtsznRrCR
Movie is releasing on 25th Dec!!
See u guys in theatres ❤️😘— Raj Tarun (@itsRajTarun) December 17, 2019