మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘సైరా’ మూవీ టీజర్ ఈనెల 20 వ తేదీన విడుదల కాబోతున్నది. ఈ టీజర్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. సైరా మేకింగ్ వీడియో సూపర్ హిట్ అయ్యాక టీజర్ పై హైప్ క్రియేట్ అయ్యింది. సైరా సినిమాను దక్షిణాది నాలుగు భాషలతో పాటు అటు హిందీలో కూడా రిలీజ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటె, సైరా తెలుగు టీజర్ లో పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ ఉన్నట్టుగానే తమిళంలో రజినీకాంత్ చేత వాయిస్ ఓవర్ చెప్పించారని తెలుస్తోంది. మలయాళంలో మోహన్ లాల్, కన్నడలో యాష్ లు వాయిస్ ఓవర్ చెప్పారని టాక్.
ఇదే నిజమైతే ఆయా భాషల్లో సైరాకు మంచి రెస్పాన్స్ వస్తుంది అనడంలో సందేహం అవసరం లేదు. ఇప్పటికే టీజర్ ను చూసి పవన్ మెచ్చుకున్నారు. అక్టోబర్ 2 వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అమితాబ్, నయనతార, కిచ్చ సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు తదితరులు నటిస్తున్నారు.