HomeTelugu Big Storiesలాక్‌డౌన్‌ తరువాత షూటింగ్‌ ఆరంభిన తొలి చిత్రం ఇదే..

లాక్‌డౌన్‌ తరువాత షూటింగ్‌ ఆరంభిన తొలి చిత్రం ఇదే..

15 1
నటుడు, దర్శకుడు రవిబాబు సినిమాల్లోనే కాదు.. పనిలోనూ, ప్రవర్తనలోను కూడా వైవిధ్యాన్ని ప్రదర్శిస్తాడు. ఆయన తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘క్రష్‌’. లాక్‌డౌన్‌ తర్వాత సినిమా షూటింగ్‌లకు అనుమతి రావడంతో చిత్రీకరణ ఆరంభించారు. ప్రభుత్వ అనుమతులు లభించిన తర్వాత ప్రారంభమైన తొలి సినిమా షూట్‌ ఇదేనని ఈ సందర్భంగా రవిబాబు అన్నాడు. ఈ మేరకు సెట్‌లో తీసిన వీడియో విడుదల చేశారు. హీరో హీరోయిన్‌ కౌగిలించుకునే సన్నివేశాన్ని తెరకెక్కించామని చెప్పారు. ‘హీరో ఈ పక్క నుంచి పరిగెత్తుకుని వస్తాడు.. హీరోయిన్‌ ఆ పక్క నుంచి పరిగెత్తుకుని వస్తుంది. ఇద్దరు గట్టిగా హగ్‌ చేసుకుంటారు’ అంటూ రవిబాబు మధ్యలో గాజు గోడను పెట్టారు. రొమాంటిక్ సన్నివేశంలోనూ భౌతికదూరాన్ని పాటిస్తున్నామని ఆ సన్నివేశం ద్వారా ఆయన స్పష్టం చేశాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu