HomeTelugu Trending'సాహో' నుండి రొమాంటిక్‌ సాంగ్‌

‘సాహో’ నుండి రొమాంటిక్‌ సాంగ్‌

4 29‘సాహో’ చిత్రం నుండి రొమాంటిక్‌ సాంగ్‌ టీజర్‌ విడుదలైంది. మంచు కొండల్లో ప్రభాస్‌, శ్రద్ధా కపూర్‌పై ఈ పాటను చిత్రీకరించారు. హరిచరణ్‌ శేషాద్రి, తులసీ కుమార్‌ ఈ గీతాన్ని ఆలపించారు. కృష్ణ కాంత్‌ సాహిత్యం అందించారు. ‘నిన్నలు మరిచేలా నిన్ను ప్రేమిస్తాలే.. నీ కన్నులు అలిసేలా నే కనిపిస్తాలే..’ అంటూ సాగే ఈ గీతానికి యూట్యూబ్‌లో విశేషమైన ఆదరణ లభిస్తోంది. తెలుగుతోపాటు తమిళం, హిందీ, మలయాళ భాషల్లో ఈ పాట టీజర్‌ను విడుదల చేశారు.

‘బాహుబలి’ వంటి బ్లాక్‌బస్టర్‌ తర్వాత ప్రభాస్‌ నటిస్తున్న చిత్రమిది. దర్శకుడు సుజీత్‌ యాక్షన్‌ చిత్రంగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. నీల్‌ నితిన్‌ ముఖేష్‌, జాకీ ష్రాఫ్‌, వెన్నెల కిశోర్‌, అరుణ్‌ విజయ్‌ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జిబ్రాన్‌ సంగీతం అందిస్తున్నారు. ఆగస్టు 30న చిత్రం విడుదల కాబోతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!