HomeTelugu Newsరవితేజ-రానా మల్టీస్టారర్ దర్శకుడు ఇతనే!

రవితేజ-రానా మల్టీస్టారర్ దర్శకుడు ఇతనే!

11 18
టాలీవుడ్ ప్రస్తుతం మల్టీస్టారర్ మూవీల ట్రెండ్‌ నడుస్తోంది. ‘సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు’ మూవీతో ప్రారంభ‌మైన ఈ ట్రెండ్ ఇప్ప‌టికీ కొన‌సాగుతూనే ఉంది. కాగా తాజాగా తెలుగు ప‌రిశ్ర‌మ‌లో మ‌రో మల్టీస్టారర్ రాబోతున్నట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. రవితేజ, రానా కలిసి మలయాళ సినిమా ‘అయ్యప్పనుమ్‌ కోశియుమ్‌’ రీమేక్‌లో నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాని తెలుగులో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మించనుంది. త్వరలోనే అధికారికంగా ప్ర‌క‌ట‌న‌ వెలువడే అవకాశం ఉంది. కాగా ఈ సినిమాకి ఎవరు దర్శకత్వం వహిస్తారనే అనే అంశంపై ఇప్పటివరకు స్పష్టత రాలేదు. మొదట హరీశ్‌ శంకర్‌, సుధీర్‌ వర్మ వంటి యంగ్‌ డైరెక్టర్ల పేర్లు వినిపించిన ఎవరూ ఫైనల్‌ కాలేదు. అయితే టాలీవుడ్‌ సర్కిళ్లలో వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి సాగర్‌ చంద్ర దర్శకత్వం వహించనున్నారట. ‘అయ్యారే, అప్పట్లో ఒకడుండే వాడు’ వంటి సెన్సిబుల్‌ చిత్రాలతో ఆకట్టుకున్న యువ దర్శకుడు సాగర్‌ చంద్రతో నిర్మాతలు చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu