HomeTelugu Trendingహీరోయిన్‌ సాక్షి శివానంద్ పై హత్యాయత్నం కేసు!

హీరోయిన్‌ సాక్షి శివానంద్ పై హత్యాయత్నం కేసు!

8 21మెగాస్టార్ చిరంజీవి మాస్టర్, ఇద్దరు మిత్రులు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది సాక్షి శివానంద్. ఈ రెండు సినిమాలతో టాలీవుడ్ లో మంచి ఫేమస్ అయ్యింది. తెలుగులో నటించిన మొదటి సినిమా మాస్టర్ ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇద్దరు మిత్రులు, యువరాజు, సింహరాశిలాంటి ఎన్నో సినిమాలు చేసిన సాక్షి శివానంద్ .. కెరీర్ మంచిగా సాగుతున్న దశలో పెళ్లి చేసుకుంది.

తాను సినిమాల్లో చేస్తున్న సమయంలో తన సోదరి సాక్షి ఆనంద్ ను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసింది. ఇప్పుడు ఆమె సోదరి సాక్షి ఆనంద్ తన అక్క, ఆమె అత్తపై కేసు పెట్టింది. తనను హత్య చేసేందుకు వాళ్ళ ప్రయత్నిస్తున్నారని, తన భీమా డబ్బు కోసం ఇలా చేస్తున్నారని చెప్పి కేసు పెట్టింది. తాను ఈ కేసు ఫైల్ చేసే సమయంలో విదేశాలకు వెళ్లిపోయారని పోలీసుల ఫిర్యాదులో పేర్కొంది సాక్షి ఆనంద్. మరి దీనిపై పోలీసులు ఎలా స్పందిస్తారో చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu