అక్కినేని సమంత తాజాగా ఓ క్రేజీ ప్రాజెక్టులో నటించబోతున్నారు. జాను తర్వాత సమంత ఎలాంటి సినిమాను ప్రకటించలేదు. లాక్డౌన్ సమయంలో సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులకు టచ్లో ఉంది సమంత. ఆహా యాప్లో సామ్జామ్ కార్యక్రమంతో అలరిస్తోంది. ఇప్పుడు కథానాయిక ప్రాధాన్యత గల “శకుంతలం” చిత్రంలో నటించబోతుంది. చారిత్రక ప్రాముఖ్యత కలిగిన ఈ చిత్రానికి గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి టైటిల్ మోషన్ పోస్టర్ను విడుదలచేసింది చిత్రబృందం. గుణ టీమ్ వర్క్స్ పతాకంపై నీలిమ గుణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా మూవీగా తెరకెక్కబోతుంది.