రామాయణ ఇతివృత్తంతో రూపొందించిన ఆదిపురుష్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలు ఇటీవల తిరుమలలో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకల కోసం తిరుమల వెళ్లిన సినిమా బృందం కొండపై శ్రీవారి దర్శనానికి వెళ్లింది.
దర్శనం తర్వాత బయటకు వచ్చిన హీరోయిన్ కృతి సనన్ను దర్శకుడు ఓంరౌత్ దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకున్నారు. దీనిపై పెద్ద వివాదమే చెలరేగింది. ఆధ్యాత్మిక క్షేత్రంలో ఇలాంటి పనులేంటని హిందూ సంఘాలు మండిపడుతున్నాయి.
దర్శకుడు ఓం రౌత్ వ్యవహారంపై సనాతన ధర్మ పరిరక్షణ సమితి ఆవేదన వ్యక్తం చేసింది. తిరుపతి ఎస్వీయూ క్యాంపస్ లోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఇలాంటి ఘటనలు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తాయని, వారిపై కఠినచర్యలు తీసుకోవాలని సమితి సభ్యులు డిమాండ్ చేశారు.
ఈ ఘటనపై చిలుకూరు దేవస్థానం ప్రధాన అర్చకులు రంగరాజన్ కూడా మండిపడ్డారు. వారిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు సైతం డిమాండ్ చేశారు. సినిమా రంగంలో పెక్, ఫ్లయింగ్ కిస్ ఇస్తూ బైబై చెప్పడం సాధారణమే కావచ్చు కానీ తిరుమల వంటి పుణ్య క్షేత్రంలో ఇలా చేయడం సరైన పద్ధతి కాదంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అనుష్క ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ టీజర్
సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్: భయం కలిగించే చాలా సన్నివేశాలు
బట్టలు లేకుండా హట్ లుక్లో విద్యాబాలన్
హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు
శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు