HomeTelugu Trendingచిరంజీవితో యాక్షన్‌ డ్రామా చేయాలని ఉంది: సందీప్‌ రెడ్డి వంగా

చిరంజీవితో యాక్షన్‌ డ్రామా చేయాలని ఉంది: సందీప్‌ రెడ్డి వంగా

Sandeep Reddy Vanga wants t
అర్జున్ రెడ్డి సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగా క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇక ఇప్పుడు యానిమల్ సినిమాతో ఆ క్రేజ్‌ మరింత పెరిగింది. ఈ దర్శకుడితో సినిమా చేయాలి అని ఇప్పుడు స్టార్ హీరోలు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మహేష్ బాబు కూడా అతని మీద ఇష్టంతోనే యానిమల్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న విషయం తెలిసిందే.

ఇక దర్శకుడు రాజమౌళి సైతం తనకు ఇష్టమైన దర్శకులలో సందీప్ ఒకరు అని డైరెక్ట్ గానే చెప్పేసాడు. కేవలం రెండు సినిమాలతోనే స్టార్‌ డైరెక్టర్‌ల జాబితాలో చేరిపోయిన సందీప్ రెడ్డి కథ చెబితే వినడానికి ఇప్పుడు చాలామంది హీరోలు సిద్ధంగా ఉన్నారు. అయితే ప్రతి దర్శకుడికి కూడా మెగాస్టార్ లాంటి హీరోతో వర్క్ చేయాలి అని కోరికగా ఉంటుంది. ఇక సందీప్ ఇంటర్వ్యూలలో తాను మెగాస్టార్ చిరంజీవి అభిమానిని అని చాలా క్లియర్ గా చెప్పాడు.

అలాగే పవన్ కళ్యాణ్ అంటే కూడా ఎంతో అభిమానం అని తెలియజేశాడు. అయితే ఇప్పుడు యానిమల్ సినిమా సక్సెస్ అయిన తర్వాత కూడా అదే విషయాన్ని చెబుతున్న ఈ దర్శకుడు తప్పకుండా మెగాస్టార్ చిరంజీవితో ఒక అవకాశం వస్తే సినిమా చేస్తానని అంటున్నాడు. అయితే అవకాశం వస్తే సినిమా చేస్తాడు అనే విషయంలో కూడా సందీప్ చాలా క్లియర్ గా ఉన్నాడు.

చిరంజీవి గారితో యాక్షన్ డ్రామా సినిమా చేయాలని ఉంది అని తన మనసులోని కోరికను బయటపెట్టేసాడు. ఒక విధంగా ఇలాంటి కాంబినేషన్ సెట్ అయితే చూడాలని కూడా ఫాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రస్తుతం సందీప్ లైనప్ చాలా పెద్దగానే ఉంది. ప్రభాస్ తో స్పిరిట్ సినిమా వచ్చే ఏడాది స్టార్ట్ కానుంది. ఇక ఆ తర్వాత బన్నీ ఆ తరువాత మహేష్ బాబుతో కూడా సినిమా చేసే ఛాన్స్ ఉంది. మరి వీరి తర్వాత సందీప్ రెడ్డి చిరంజీవితో సినిమా చేస్తాడో లేదో చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu