HomeTelugu Newsఇండియాలో ఆపితే హాలీవుడ్‌కు వెళ్లిపోతా అంటున్న దర్శకుడు!

ఇండియాలో ఆపితే హాలీవుడ్‌కు వెళ్లిపోతా అంటున్న దర్శకుడు!

Director Sensational commen
అర్జున్‌ రెడ్డి సినిమాతో టాలీవుడ్‌ దర్శకుడిగా పరిచమైయ్యాడు సందీప్ రెడ్డి వంగా. ఆ తరువాత కబీర్ సింగ్ సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చాడు తన నెక్ట్స్‌ మూవీ యానిమల్‌ కూడా బాలీవుడ్‌లోనే తీశాడు. ఈ సినిమా తరువాత బాలీవుడ్ మీడియాలో సందీప్ రెడ్డి వంగా హాట్ టాపిక్ అయ్యాడు.

అందుకు కారణం ఆయన తెరకెక్కించిన యానిమల్ మూవీనే. గతేడాది డిసెంబర్ 1న విడుదలైన యానిమల్ మూవీ మాసీవ్ హిట్ అందుకుంది. సినిమాలోని బీజీఎమ్, సీన్స్, స్క్రీన్ ప్లే, సందీప్ రెడ్డి టేకింగ్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దాంతో సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు కొల్లగొట్టింది.

రణ్‌బీర్‌ కపూర్‌, రష్మిక మందన్నా హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా లాంగ్ రన్‌లో రూ. 900 కోట్లకుపైగా కలెక్షన్స్ సాధించింది. ఈ సినిమాపై ఓ రెంజ్‌లో విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇతర సినీ ఇండస్ట్రీ ప్రముఖులు మూవీపై, సందీప్ రెడ్డి వంగాపై విమర్శలు చేస్తున్నారు. ఈ సినిమా బోల్డ్ కంటెంట్, స్త్రీల పట్ల ద్వేషం, వేధింపులను ప్రోత్సహించేలా ఉన్నాయంటూ, ప్రేక్షకులపై చెడు ప్రభావం చూపిస్తోందని కామెంట్స్‌ చేస్తున్నారు.

ఈ క్రమంలో కామెంట్స్ చేసిన ప్రతి ఒక్క క్రిటిక్‌కు, యాక్టర్స్‌కు స్ట్రాంగ్‌ రిప్లయ్‌ ఇచ్చాడు సందీప్ రెడ్డి వంగా. “సాధారణ జనం అంటే నేను పెద్దగా పట్టించుకునేవాన్ని కాదు. కానీ, ఇండస్ట్రీలో ఉండి అన్ని తెలిసిన పాపులర్ యాక్టర్స్ అలా అనడం బాధగా ఉంది. ఎవరైనా సరే ఇతరులను అనేముందు వారు గతంలో ఏం చేశారో చూసుకుని అనాలి” అంటూ స్ట్రాంగ్ కౌంటర్స్ ఇచ్చాడు సందీప్ రెడ్డి.

“ఒకవేళ విమర్శించే వాళ్లు నన్ను ఇండియాలో ఆపితే నేను హాలీవుడ్‌కు వెళ్లిపోతా. నాకు భాషా పరిమితులు అంటూ ఏం లేవు. నేను భోజ్‌పురి, కన్నడ, మలయాళం, పంజాబీతోపాటు ఇతర భాషల్లో కూడా సినిమాలు చేస్తాను” అని సందీప్ రెడ్డి వంగా చెప్పుకొచ్చాడు. తనపై, యానిమల్ మూవీపై విమర్శలు ఎక్కువగా వచ్చేసరికి తాజాగా ఇలాంటి స్టేట్‌మెంట్ ఇచ్చాడు సందీప్ రెడ్డి వంగా. అయితే, ఏది ఏమైనా యానిమల్‌కు సీక్వెల్ యానిమల్ పార్క్‌ను తెరకెక్కించేందుకు డిసైడ్ అయ్యాడని తెలుస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu