HomeTelugu Trending''ఆడాళ్లూ.. మీకు జోహార్లు'' అంటున్న శర్వానంద్‌

”ఆడాళ్లూ.. మీకు జోహార్లు” అంటున్న శర్వానంద్‌

Sharwanand new movie aadal
టాలీవుడ్‌ యంగ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం ‘మాహా సముద్రం’ , ‘శ్రీకారం’ అనే సినిమాను చేస్తున్నాడు. తాజాగా వీటితో పాటు మరో సినిమాను కూడా ప్రకటించాడు శర్వానంద్‌. కిషోర్ తిరుమల డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాకి ”ఆడాళ్లూ.. మీకు జోహార్లు” అనే టైటిల్‌ని ప్రకటించాడు. దసరా సందర్భంగా అక్టోబర్ 25న తిరుపతిలో ‘ఆడాళ్లూ.. మీకు జోహార్లు’ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు.

శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ లో సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ‘నేను శైలజ’, ‘ఉన్నది ఒకటే జిందగీ’, ‘చిత్రలహరి’, ‘రెడ్’ వంటి సినిమాలను రూపొందించిన కిషోర్ తిరుమల ఈ సినిమాతో మరో హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉండబోతుందని సమాచారం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంది.

క్లాప్ బోర్డ్‌తో గుత్తాజ్వాల స్పెషల్ ఇంటర్వ్యూ

Recent Articles English

Gallery

Recent Articles Telugu