HomeTelugu Trendingసిద్ధార్థ తాజా మూవీలో ద్విపాత్రాభినయం

సిద్ధార్థ తాజా మూవీలో ద్విపాత్రాభినయం

2 12

హీరో సిద్ధార్థ ఈ మధ్య సినిమాల కంటే సామాజిక అంశాలపైనే ఎక్కువగా స్పందిస్తున్నాడు. అందుకు తగ్గట్టుగానే గతేడాది సామాజిక నేపథ్యంతో తెరకెక్కిన ‘శివప్పు మంజల్‌ పచ్చై’ సిద్ధార్థ్‌కి మంచి పేరు తీసుకొచ్చింది. ఆ తరువాత వచ్చిన ‘అరువం’ బాక్సాఫీస్‌ దగ్గర ఆశించిన ఫలితాన్నివ్వకపోయినా నటుడిగా సిద్ధార్థ స్థాయిని పెంచింది. కమల్‌హాసన్‌, శంకర్‌ కాంబినేషన్‌లో భారతీయుడు సీక్వెల్ ‘ఇండియన్‌-2’లో సిద్ధార్థ ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఇక ఇప్పటికే షూటింగ్‌ పూర్తయిన ‘సైతాన్‌ కా బచ్చా’, ‘టక్కర్‌’ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొత్త దర్శకుడు అమృతరాజ్‌ తెరకెక్కించనున్న కొత్త చిత్రంలో సిద్ధార్థ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో హీరోయిన్లుగా నివేదా థామస్‌, ప్రియాంక జవల్కర్‌ను ఎంపిక చేసినట్టు సమాచారం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu