HomeTelugu Trendingఢిల్లీ ఎయిర్‌పోర్టులో పరిస్థితులపై జక్కన్న అసహనం

ఢిల్లీ ఎయిర్‌పోర్టులో పరిస్థితులపై జక్కన్న అసహనం

Rajamouli about Delhi Airpo
ఢిల్లీ ఎయిర్‌పోర్టులో కనీస వసతులు లేవంటూ ప్రముఖ దర్శకుడు రాజమౌళి అసహనం వ్యక్తంచేశారు. అక్కడి పరిస్థితులపై ట్విట్టర్‌లో తన అసంతృప్తిని వెల్లడించారు. వృత్తిపరమైన పనులతో బుధవారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నానని తెలిపారు. కరోనా పరీక్షల గురించి అవసరమైన కొన్ని పత్రాలు ఇచ్చి వాటిని పూర్తిచేయమన్నారు. ఆ పత్రాలను నింపడం కోసం కొంతమంది ప్రయాణికులు గోడలకు ఆనుకుని, మరికొంతమంది నేలపైనే కూర్చుని ఆ పత్రాలను పూర్తిచేస్తున్నారు.

అక్కడి పరిస్థితి చూడటానికి చాలా దారుణంగా ఉంది. ఇటువంటి వాటికోసం కనీసం చిన్న టేబుల్‌ కూడా ఏర్పాటు చేయకపోవడం చాలా బాధగా అనిపించింది అన్నారు. ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వచ్చే ద్వారం వద్ద చాలా వీధి కుక్కలు ఉన్నాయి. విదేశీయులు ఇలాంటివి చూస్తే మనదేశంపై ఎలాంటి భావన కలుగుతుందో ఒకసారి ఆలోచించాలి, దయచేసి అధికారులు దీనిపై దృష్టిపెట్టాలి అంటూ రాజమౌళి ట్వీట్ చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu