Ram Charan’s birthday special: గ్లోబల్ స్టార్ పుట్టినరోజు (మార్చ్ 27) రేపు. ఈ సందర్భంగా.. చరణ్ ఫ్యాన్స్ సంబరాల్లో మునిగిపోయారు. అభిమానులంతా ఇప్పటికే చరణ్ బర్త్డే కి సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ఇదిలా ఉంటే చరణ్ బర్త్డే కు చిరంజీవి సతీమణి, చరణ్ తల్లి సురేఖ ఓ భారీ గిఫ్ట్ ఇచ్చారు.
కోడలు ఉపాసనతో కలిసి ఇటీవల సురేఖ అత్తమ్మస్ కిచెన్ అని కొత్త బిజినెస్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. రామ్చరణ్ బర్త్ డే సందర్భంగా అత్తమ్మాస్ కిచెన్ సంస్థ తరపున 500 మందికి అన్నదానం చేశారు. స్వయంగా సురేఖ వండిన ఆహారాన్ని అపోలో లోని ఆలయంలో భక్తులకు అన్నదానం చేశారు. ఆమె స్వయంగా వడ్డించి.. దగ్గరుండి అన్ని చూసుకున్నారు సురేఖ.
ఈ కార్యక్రమానికి చిన్నజియ్యర్ స్వామి హాజరయ్యారు. ఇందుకు సంబందించిన వీడియోను అత్తమ్మాస్ కిచెన్ ఇన్ స్టాగ్రామ్ పేజ్ లో పోస్ట్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. చరణ్ తల్లి పై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram
;