HomeTelugu Newsకరీంనగర్‌లో మరో ఇద్దరికి కరోనా పాజిటివ్‌

కరీంనగర్‌లో మరో ఇద్దరికి కరోనా పాజిటివ్‌

12 21
రాష్ట్రంలో కరోనా విజృభిస్తుంది. తాజాగా కరీంనగర్‌లో మరో ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయినట్టు జిల్లా కలెక్టర్‌ శశాంక వెల్లడించారు. ఇండోనేసియా వారితో తిరిగిన వ్యక్తికి గతంలో కరోనా పాజిటివ్‌ వచ్చిందని వెల్లడించారు. తాజాగా ఆ వ్యక్తి సోదరి, తల్లికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు కలెక్టర్‌ తెలిపారు. ఆ ముగ్గురిని కలిసిన వారిని గుర్తించేందుకు చర్యలు చేపట్టామని, వారితో సన్నిహితంగా తిరిగిన వారి వివరాలు సేకరిస్తున్నామని ఆయన తెలిపారు. సదరు వ్యక్తితో పాటు ఇంట్లో 8 మంది ఉంటారని, వారిలో ఇద్దరికే పాజిటివ్‌ వచ్చిందని కలెక్టర్‌ అన్నారు. మొత్తం 8 మందినీ గాంధీ ఆస్పత్రికి తరలించామని, కుటుంబంలోని ముగ్గురు పిల్లలకు కూడా ఆస్పత్రిలో చేర్పించామని వెల్లడించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu