HomeTelugu Big Storiesవారణాసిలో మోడీకి పోటీగా రైతుల నామినేషన్‌

వారణాసిలో మోడీకి పోటీగా రైతుల నామినేషన్‌

5 26వారణాసిలో నామినేషన్లు వేసేందుకు వెళ్లిన నిజామాబాద్ పసుపు రైతులను స్థానిక బీజేపీ నేతలు, ఇంటెలిజెన్స్ పోలీసులు ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నం చేసినా.. స్థానిక రైతుల నుంచి అనూహ్యంగా మద్దతు లభించింది. నామినేషన్లు వేసేందుకు శనివారం రోజు వారణాసికి చేరుకున్న రైతులను ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నించారు బీజేపీ నేతలు. నామినిగా ఉండేందుకు స్థానికులు ఎవ్వరూ ముందుకు రాలేదుద. అయితే, నామినేషన్లు వేసేందుకు సిద్ధమైన పసుపు రైతులకు మద్దతు ప్రకటించాయి స్థానిక రైతు సంఘాలు. నామినిగా ఉండేందుకు వారు అంగీకారం తెలిపారు. దీంతో రైతుల నామినేషన్లకు సంబంధించిన డ్యాకుమెంటేషన్ ప్రక్రియ పూర్తికావొచ్చింది. స్థానిక బీజేపీ నేతలు, ఇంటెలిజెన్స్ అధికారులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా పట్టు వదలని పసుపు రైతులు నామినేషన్ వేసేందుకు సిద్ధమయ్యారు.

రేపు 45 మంది పసుపు రైతులు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. మరోవైపు ఏపీలోని ప్రకాశం జిల్లాకు చెందిన 8 మంది రైతులు కూడా నామినేషన్లు వేస్తారు. ఇక తమిళనాడులోని హీరోడ్ ప్రాంతానికి చెందిన మరో 15 మంది రైతులు కూడా నామినేషన్ పత్రాలు సిద్ధం చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ రెండో సారి బరిలోకి దిగిన వారణాసి లోక్‌సభ స్థానానికి ఇప్పటికే స్థానికంగా 60కి పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. మోడీపై పోటీచేసేందుకు స్థానికులు ఉత్సాహం చూపిస్తున్నారు. ఇక తెలంగాణ, తమిళనాడు, ఏపీ రైతులు కూడా నామినేషన్ల వేస్తే.. నామినేషన్ల సంఖ్య 100 దాటిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో దేశ వ్యాప్తంగా వారణాసి లోకసభ ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu