HomeTelugu Trending'నాట్యం' పాటను విడుదల చేసిన రవితేజ

‘నాట్యం’ పాటను విడుదల చేసిన రవితేజ

Venuvulo Video Song from Na
ప్రముఖ కూచిపూడి నాట్యకారిణి సంధ్యారాజు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘నాట్యం’. సంధ్యారాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి రేవంత్ కోరుకొండ దీనికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలోని రెండు పాటలను బాలకృష్ణ, వెంకటేశ్ ఇప్పటికే విడుదల చేయగా, తాజాగా వేణువులో చేర‌ని గాలికి సంగీతం లేదు… అనే పాట‌ను మాస్ మ‌హారాజా ర‌వితేజ రిలీజ్ చేసి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. చెప్పారు.

క‌రుణాక‌ర్ అడిగ‌ర్ల సాహిత్యం అందించిన ఈ పాట‌కు శ్రవణ్ భ‌రద్వాజ్ స్వరరచన చేశారు. అనురాగ్ కుల‌క‌ర్ణి శ్రావ్యంగా ఆల‌పించిన ఈ పాట శ్రోత‌ల‌ను తప్పనిసరిగా ఆకట్టుకుంటుందని, సినిమాను ఈ నెల 22న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుదల చేయబోతున్నామని రేవంత్ కోరుకొండ తెలిపారు. కమల్ కామరాజ్, రోహిత్ బెహల్, ఆదిత్య మీనన్, భానుప్రియ, ‘శుభలేఖ’ సుధాకర్, రుక్మిణీ విజయకుమార్, బేబీ దీవెన ఇందులో ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా నిశృంఖల ఫిలిమ్స్ పతాకంపై రూపుదిద్దుకుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu