కీర్తి సురేష్ ‘మహానటి’ సినిమాతో జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాతో ‘సావిత్రి’ పాత్రలో కీర్తి మెప్పించింది. ఈ భామ ఆ సినిమా తరవాత చాలా జాగ్రత్తగా ఆచి తూచి అడుగులు వేస్తుంది ఈ అమ్మడు. కథల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు వహిస్తుంది. మహానటి సినిమా తరువాత కొంత గ్యాప్ తీసుకొని సినిమాలు చేస్తుంది కీర్తి సురేష్. వాటిలో ‘పెంగ్విన్’ సినిమా ఇటీవల ఓటిటీ లో విడుదల కాగా.. ‘మిస్ ఇండియా’ అనే సినిమా విడుదల సిద్ధంగా ఉంది. ప్రస్తుతం ఇక ఈ బ్యూటీ తమిళ్ సూపర్ స్టార్ రజినీ కాంత్ తో ‘అన్నాత్తే’ చిత్రంలో.. తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు ‘ సర్కారు వారి పాట’ సినిమాల్లో నటిస్తుంది. అదే విధంగా యంగ్ హీరో నితిన్ తో ‘రంగ్ దే’ చిత్రంలోనూ నటిస్తుంది ఇదిలా ఉంటే కీర్తి మరో స్టార్ హీరో కమల్హాసన్తో రొమాన్స్ చేసే అవకాశం దక్కించుకున్నట్టు సమాచారం .గౌతమ్ మీనన్ దర్శకత్వంలో 2006లో విడుదలైన ‘రాఘవన్’ చిత్రానికి సీక్వెల్గా రూపొందబోయే సినిమాలో కమల్ సరసన కీర్తి నటించనుందని తెలుస్తోంది. ఈ సీక్వెల్ కు కూడా గౌతమ్ మీనన్ దర్శకత్వం వహిస్తున్నారు. అంతేకాదు ఆయనే ఈ సినిమాకు నిర్మాతగానూ వ్యవహరించబోతున్నాడు.