HomeTelugu Newsవేద్‌ వచ్చేవరకు తాళికట్టనన్నారు.. భర్త గురించి సౌందర్య రజనీకాంత్‌!

వేద్‌ వచ్చేవరకు తాళికట్టనన్నారు.. భర్త గురించి సౌందర్య రజనీకాంత్‌!

3 15సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కుమార్తె సౌందర్య ఇటీవల ప్రముఖ నటుడు విశాఖన్‌ వనగమూడిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరికీ ఇది రెండో వివాహం. ఈ నేపథ్యంలో విశాఖన్‌ గురించి, తన కుమారుడు వేద్‌ గురించి సౌందర్య ఓ తమిళ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. ‘నా కుమారుడు వేద్‌కు విశాఖన్‌ ఫొటో చూపించి ‘ ఇదిగో డ్యాడీ’ అని చెప్పాను. ఆయన ఫొటో చూసి వేద్‌ తెగ సంబరపడిపోయేవాడు. మొదటిసారి చూసినప్పుడే వేద్‌కు విశాఖన్‌ నచ్చారు. వేద్‌ విషయంలో ఆయనకు ఓపిక ఎక్కువ. పెళ్లి ముహూర్తం దగ్గరపడుతున్న సమయంలో వేద్‌ను మావాళ్లు ఇంకా మండపానికి తీసుకురాలేదు. దాంతో వాడు పెళ్లి చూస్తాడో లేదోనని చాలా కంగారుపడ్డాను. అప్పుడు విశాఖన్‌ నాకు ధైర్యం చెప్పారు. వేద్‌ వచ్చేవరకు తాళికట్టనన్నారు. విశాఖన్‌ వద్ద ఉంటే వేద్‌ సురక్షితంగా ఉంటాడు. నాకు కావాల్సింది కూడా అదే. మా పిల్లల వద్ద ఏ విషయాలూ దాచాలనుకోవడం లేదు. నిజం చెప్పాలంటే ‘మీ అమ్మను పెళ్లిచేసుకుంటా. నీకు ఇష్టమేనా?’ అని విశాఖన్‌ వేద్‌ వద్ద అనుమతి కూడా తీసుకున్నారు. ఆ సమయంలో నేను తీసిన వీడియో కూడా ఉంది. కానీ దానిని ఇప్పుడే మీకు చూపించను. వేద్‌కు 18 ఏళ్లు వచ్చాక చూపిస్తాను’ అని వెల్లడించారు సౌందర్య.

2010లో సౌందర్య.. అశ్విన్‌ అనే వ్యాపారవేత్తను ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరిద్దరి కుమారుడే వేద్‌. పెళ్లైన నాలుగేళ్లకే మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu