HomeTelugu Trendingరజనీకాంత్ కుమార్తెపై నెటిజన్ల ట్రోలింగ్‌

రజనీకాంత్ కుమార్తెపై నెటిజన్ల ట్రోలింగ్‌

8

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కుమార్తె సౌందర్య రజనీకాంత్‌ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారన్న సంగతి తెలిసిందే. తన కుమారుడు వేద్‌కు సంబంధించిన ఫొటోలు తరచుగా ఆమె షేర్‌ చేస్తూ ఉంటారు. సౌందర్య తన కుమారుడు వేద్‌తో కలిసి స్విమ్మింగ్‌పూల్‌లో ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్‌ చేయడంతో దానిపై నెటిజన్ల నుంచి చేదు అనుభవం ఎదురైంది. తమిళనాడు ప్రజలు నీటి కోసం అల్లాడుతుంటే మీరు ఇలా స్విమ్మింగ్‌ పూల్‌లో నీటిని వృథా చేస్తారా అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. దీంతో సౌందర్య తన ఫొటోలను తొలగించారు.

చిన్నతనం నుంచే పిల్లలకు శారీరక వ్యాయామం అవసరమనే విషయాన్ని చెప్పాలనే సదుద్దేశంతో ఆ ఫొటోను షేర్‌ చేశానని ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న నీటి కొరత నేపథ్యంలో నా ట్రావెల్‌ డైరీలోని ఈ ఫొటోను తొలగించానని సౌందర్య వివరణ ఇచ్చారు. అయితే రజనీకాంత్ అభిమానులు సౌందర్యకు అండగా నిలిచారు. పాత ఫొటోతో మిమ్మల్ని ట్రోల్‌ చేస్తున్న వారిని పట్టించుకోకండి. నీటి కొరతతో ఇబ్బంది పడుతున్న వారికి తలైవా చేస్తున్న సహాయం వారికి కనిపించడం లేదు అంటూ ట్రోలర్స్‌కు కౌంటర్‌ ఇస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu