ఒక్క కన్నుగీటుతో రాత్రికి రాత్రే సోషల్ మీడియా సన్సేషన్గా మారిన మలయాళ నటి ప్రియా ప్రకాశ్ వారియర్.. కేరళ రాష్ట్రానికి తనవంతు సహాయం చేశారు. ఈ విషయాన్ని ఆమె సోషల్మీడియా వేదికగా తెలిపారు. అయితే పబ్లిసిటీ కోసం దీన్ని చేయలేదని, మీరూ విరాళాలు అందించండని తన ఫాలోవర్స్ను కోరారు. ఈ ఓనం పండుగ సందర్భంగా తన రాష్ట్రం కోసం చేసిన చిన్న సహాయం ఇదని అన్నారు.
‘ఈ ఓనం పండుగకు నేను రాష్ట్రం కోసం చేయగల్గినది చేశా. మాటలు చెప్పడం కన్నా చేతల్లో చేస్తేనే ఇంకా ఎక్కువ ప్రభావవంతంగా వినిపిస్తుంది. మీ విలువైన విరాళాలు అందించండి. నేను పబ్లిసిటీ కోసం దీన్ని చేయలేదు. మేం ఎంత విరాళం ఇచ్చామో తెలిసినప్పుడు ప్రజలు దాన్ని సక్రమంగా ఉపయోగించుకుంటారు. అందుకే చెప్పాను. మీరు ప్రశంసించకపోయినా ఫర్వాలేదు. కానీ తక్కువ చేసి మాట్లాడకండి’ అని ప్రియా వారియర్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. దీంతోపాటు ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.లక్ష విరాళం అందించినట్లు ఉన్న లేఖను పంచుకున్నారు.