సూపర్ స్టార్ రజనీకాంత్ తాజాగా ఫిజ్జా ఫేమ్ కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో ఒక మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం డార్జిలింగ్లో కొనసాగుతున్నది. కాగా ఈ మూవీలో హీరోయిన్గా నటించే అవకాశం కాజల్కు వచ్చిందనే టాక్ వినిపిస్తుంది. ఇటీవల దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ కాజల్ కు ఈ మూవీ కథను వినిపించారట.
అయితే ఆమె ఇంత వరకూ తన నిర్ణయాన్ని తెలుప లేదు..ప్రస్తుతం ఆమె తమిళంలో క్వీన్ చిత్రంలో నటిస్తోంది. ఇక రజనీ చిత్రంలో తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి, బాబీ సింహ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్నీ సన్ పిక్చర్స్ నిర్మిస్తుంది.