HomeTelugu Newsథ్రిల్లర్ మూవీతో అదాశర్మ

థ్రిల్లర్ మూవీతో అదాశర్మ

Adah sharma new telugu movi

హార్ట్ ఎటాక్’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన హిందీ నటి అదాశర్మ. తొలి చిత్రంతో ఆకట్టుకున్న ఈ నటికి ఆ తరవాత టాలీవుడ్‌లో సరైన హిట్ తగల్లేదు. ‘క్షణం’ సినిమాలో అదాశర్మ తన నటనతో మెప్పించినా కెరీర్ పరంగా ఆమెకు పెద్దగా కలిసిరాలేదు. గత ఏడాది వచ్చిన ‘కల్కి’ కూడా పెద్దగా కలిసిరాలేదు. ఈ క్రమంలో తాజాగా తెలుగు సినిమాను అంగీకరించింది ఈ బ్యూటీ. విప్రా దర్శకత్వం లో ఈ భామ హీరోయిన్ గా నటిస్తుంది. గౌరీ కృష్ణ నిర్మాతగా.. గౌరు ఘానా సమర్పణలో ఈ చిత్రం తెరకెక్కబోతుంది. ఇటీవలే ఈ సినిమా హైదరాబాద్ లో ప్రారంభమైంది. మిస్టరీ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సందర్భంగా అదా మాట్లాడుతూ … “నా గత చిత్రాలు హార్ట్ ఎటాక్, క్షణం నాకు మంచి పేరు తెచ్చాయి, ప్రేక్షకులు నా నుంచి మంచి సినిమాలు కోరుకుంటున్నారు. ఇప్పుడు ఈ చిత్రం కూడా అలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్నా సినిమా. అలాగే తనకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన నిర్మాత గౌరీ కృష్ణ మరియు దర్శకుడు విప్రా కి ధన్యవాదాలుతెలిపింది అదా. డైరెక్టర్‌ విప్రా మాట్లాడుతూ ” మిస్టరీ కథాంశంతో వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్నారు.10 రోజులు హైదరాబాద్ లో ఈ మూవీ షూటింగ్ జరుపుకుని తర్వాత నిర్మల్ లో రెండో షెడ్యూల్ ప్రారంభిస్తాం” అని వెల్లడించారు.

Adah sharma new movi

Recent Articles English

Gallery

Recent Articles Telugu