HomeTelugu Trending33 సంవత్సరాల తర్వాత నా గురువు న‌టిస్తున్నా: రజనీకాంత్

33 సంవత్సరాల తర్వాత నా గురువు న‌టిస్తున్నా: రజనీకాంత్

Rajni with Amitabh after 33 1

రజనీకాంత్‌ జైలర్‌ విజయం తరువాత అదే ఊపుతో తన 170వ సినిమా చేస్తున్నాడు. జై భీమ్‌ డైరెక్టర్‌ T.J జ్ఞానవేల్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ ఇటీవలే ప్రారంభమైంది. కేరళ రాష్ట్ర రాజధాని అయిన తిరువునంతపురంలోని అగ్రీకల్చర్ యూనివర్సిటీ క్యాంపస్‌లో ఈ మధ్యే ఓ మేజర్ షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ తమిళనాడులోని తిరునల్వేలిలో ప్రత్యేకంగా వేసిన సెట్‌లో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఇదిలా ఉండ‌గా.. ఈ మూవీ నుంచి రజనీ కాంత్ ఓ సాలిడ్ న్యూస్ పంచుకున్నాడు.

ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే తాజాగా అమితాబ్ తలైవర్ 170 షూటింగ్‌లో జాయిన్ అయ్యాడు. ఈ విష‌యాన్ని రజనీకాంత్ ట్విట్ట‌ర్‌లో తెలుపుతూ.. ’33 సంవత్సరాల తర్వాత నా గురువు, రోల్ మాడ‌ల్, అమితాబ్ బచ్చన్‌తో మ‌ళ్లీ క‌లిసి న‌టిస్తున్నా.. నా గుండె ఆనందంతో కొట్టుకుంటుంది అంటూ రజనీకాంత్ రాసుకోచ్చాడు. కాగా ప్ర‌స్తుతం ఈ పోస్ట్ వైర‌ల్‌గా మారింది. (ఇక చివరిసారిగా వీరిద్ద‌రూ ముకుల్ ఆనంద్ దర్శకత్వంలో 1991లో ‘హమ్’ చిత్రంలో కలిసి న‌టించారు.)

అమితాబ్‌తో పాటు, రానా దగ్గుబాటి, మంజు వారియర్‌, ఫాహద్‌ ఫాజిల్ త‌దిత‌రులు ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్‌ బ్యానర్ ఈ సినిమాను నిర్మిస్తుండ‌గా.. జైలర్‌తో ఊరమాస్‌ మ్యూజిక్‌ ఇచ్చిన అనిరుధ్ రవిచందర్‌ ఈ సినిమాకు సంగీతం అందించనున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేసి వచ్చే ఏడాది ద్వితియార్థంలో రిలీజ్‌ ప్లాన్‌ చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu