HomeTelugu Trendingకరోనా బాధితులకు అక్షయ్ కుమార్ భారీ విరాళం

కరోనా బాధితులకు అక్షయ్ కుమార్ భారీ విరాళం

6 27
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నది. ఇప్పటికే మరణాల సంఖ్య 30 వేలకు చేరువైంది. ఈ సంఖ్య మరో రెండు మూడు వారాల్లో లక్ష దాటే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఊఇండియాలోనూ ఇదే పరిస్థితి వచ్చింది. ఇండియాలో 800 లకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. భారత ప్రభుత్వం దీనిపై అన్నీ రకాల చర్యలు తీసుకుంటోంది. కరొనా కేసులు పెరిగిపోతున్న తరుణంలో తాము సైతం కరోనా పోరాటంలో పాల్గోని సహాయ సహకారాలు అందిస్తామని సినిమా తారలు ముందుకు వస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ప్రధాన మంత్రి సహాయ నిధికి రూ.25 కోట్ల రూపాయల విరాళం ప్రకటించారు. తన శక్తి మేరకు సహాయం చేస్తున్నట్టుగా అక్షయ్ కుమార్ పేర్కొన్నారు.

ప్రతి ఒక్కరూ కూడా ఈ విపత్కర సమయంలో ఆదుకోవాలని పిలుపునిచ్చారు. ఇటు టాలీవుడ్ సినిమా స్టార్స్ సైతం కరోనాపై పోరాటం చేస్తున్న ప్రభుత్వానికి సహాయం చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu