HomeTelugu Trendingతండ్రి మరణంపై ప్రదీప్‌ ఎమోషనల్‌ ట్వీట్‌

తండ్రి మరణంపై ప్రదీప్‌ ఎమోషనల్‌ ట్వీట్‌

Anchor pradeep machiraju

టాలీవుడ్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు గురించి ప్రత్యేకంగా చెప్పనసరం లేదు. ఇటీవలే ప్రదీప్ తన తండ్రి పాండురంగను కోల్పోయాడు. ఏమైందో తెలియదు కానీ ప్రదీప్ తండ్రి మే 1న చనిపోయారు. ఇదివరకు అనారోగ్యంతో బాధపడుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఆయన కరోనా టైంలో చనిపోయే సరికి అనారోగ్యం కారణంగా చనిపోయారా లేక కరోనాతో చనిపోయారా అనేది తెలియలేదు. అయితే తండ్రి చనిపోయినప్పుటి నుండి ప్రదీప్ పూర్తిగా కుంగిపోయాడు. గతనెల నుండి ప్రదీప్ ఇంటిపట్టునే ఉంటూ కరోనా జాగ్రత్తలు పాటిస్తున్నాడు. అయితే తండ్రి మరణం పై తాజాగా ప్రదీప్ స్పందించాడు. అలాగే ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. ప్రదీప్ ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టాలీవుడ్‌లో ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ సినిమాతో ప్రదీప్ హీరోగా ఏంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా హిట్ అవ్వడంతో సెకండ్ మూవీ ప్రకటించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu