HomeTelugu Big Storiesకరోనా ఎఫెక్ట్‌: టెలివిజన్ కార్మికులకు యాంకర్‌ ప్రదీప్‌ చేయూత

కరోనా ఎఫెక్ట్‌: టెలివిజన్ కార్మికులకు యాంకర్‌ ప్రదీప్‌ చేయూత

1 27
కరోనా వైరస్‌ దాటికి యావత్ ప్రపంచం చిగురుటాకులా వణికిపోతుంది. ఈ మహమ్మరి కారణంగా దేశాలన్నీ లాక్ డౌన్ ప్రకటించడంతో రోజువారీ కులీల పరిస్థితి దైనీయంగా మారింది. ఇక సినీ ఇండస్ట్రీలోనూ చిన్న చిన్న కార్మికులు పరిస్థితి కూడా ఇలానే ఉంది. వారు కూడా పనులు లేక ఇంటికే పరిమితమయ్యారు. దీంతో వారి కుటుంబాలు గడవడం కష్టంగా మారిపోయింది.

ఈ క్రమంలో వారిని ఆదుకునేందుకు టాలీవుడ్ హీరోలు ముందుడగు వేశారు. మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో ‘కరోనా క్రైసస్ ఛారిటీని ప్రారంభించారు. ఈ చారిటీకి ఇప్పటికే చిరు రూ.కోటి రూపాయలు ఇచ్చారు. నాగార్జున రూ. కోటి, మహేష్ బాబు రూ.25లక్షలు, ఎన్టీఆర్ రూ.30లక్షలు అందించారు. అలాగే నాగ చైతన్య రూ.25లక్షలు, యంగ్ హీరో కార్తికేయ రూ.2 లక్షలు తమ తరపున విరాళాలు అందజేశారు.

ఇదిలా ఉంటే బుల్లితెర యాంకర్ ప్రదీప్ సైతం తన వంతు సాయం చేయడానికి ముందుకు వచ్చారు. ‘తనకు తెలిసిన ఓ 60 కుటుంబాలకు నెలకు సరిపడ సరుకులు అందిస్తున్నానని చెబుతూ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అంతేకాకుండా స్థోమత ఉన్నవారు ముందుకు వచ్చి తమ చుట్టుపక్కల వారికి తోచిన సాయాన్ని అందించాలని కోరారు. కాగా ప్రదీప్ లీడ్ రోల్ చేసిన ’30 రోజుల్లో ప్రేమించటం ఎలా..?’ సినిమా మార్చి 25న విడుదల కావాల్సి ఉండగా.. కరోనా కారణంగా అది కాస్తా వాయిదా పడిన సంగతి విదితమే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu