HomeTelugu Trendingకావేరీ పిలుస్తోంది.. లక్ష మొక్కల్ని నాటేందుకు సమంత పిలుపు

కావేరీ పిలుస్తోంది.. లక్ష మొక్కల్ని నాటేందుకు సమంత పిలుపు

11 14

ప్రముఖ నటి సమంత ఓ మంచి పనికి నడుం బిగించారు. కావేరి నది పరిరక్షణ కోసం సద్గురు జగ్గీవాసుదేవ్ మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఆయనకు సమంత మద్దతు తెలిపారు. లక్ష మొక్కల్ని నాటే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఇందు కోసం తన అభిమానుల సహకారం కోరారు. ‘కావేరీ పిలుస్తోంది. మీరు స్పందిస్తారా.. http://samantha.cauverycalling.org వెబ్‌సైట్‌లో మీ విరాళాలు అందించండి. మీరు, నేను కలిస్తే.. లక్ష మొక్కల్ని నాటేందుకు సహకరించగలం’ అని సామ్‌ పోస్ట్‌ చేశారు. దీంతోపాటు ప్లకార్డు పట్టుకుని ఉన్న వీడియోను కూడా షేర్‌ చేశారు. రూ.42 విరాళం అందిస్తే.. ఒక్క మొక్కను నాటిన వారు అవుతారని అన్నారు.

కాగా సమంత ఇటీవల ‘ఓ బేబీ’ సినిమాతో మంచి హిట్‌ అందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె తమిళ హిట్‌ ’96’ తెలుగు రీమేక్‌లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో శర్వానంద్‌ హీరోగా నటిస్తున్నారు. దిల్‌రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu