HomeTelugu Trendingదర్బార్ సినీ నిర్మాతలకు షాక్.. టీవీలో సినిమా ప్రసారం

దర్బార్ సినీ నిర్మాతలకు షాక్.. టీవీలో సినిమా ప్రసారం

7 11
ఇటీవల విడుదలైన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ‘దర్బార్‌’ సినిమాను పైరసీ భూతం వెంటాడుతోంది. ఈ నెల 9న ‘దర్బార్‌’ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజైంది. ఈ చిత్రానికి ఎ.ఆర్‌. మురుగదాస్‌ దర్శకత్వం వహించారు. నయనతార హీరోయిన్‌గా నటించింది. హిట్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ సినిమా విడుదలైన నాలుగు రోజులకే టీవీలో ప్రసారమైంది. దీంతో ప్రొడ్యూసర్స్ ఖంగుతిన్నారు. ముందుగా చిత్రానికి సంబంధించిన హెచ్‌డీ వెర్సన్ లింక్ వాట్సాప్‌లో సర్క్యులేట్ అయింది. ఊహించని విధంగా ఈ నెల 12న శరణ్య టీవీ నిర్వాహకులు మూవీ పైరసీ ప్రింట్‌ను జవనరి 12వ తేదీ మదురైలో ప్రసారం చేశారు. దీనిపై ‘దర్బార్‌’ మూవీ ప్రొడ్యూస్ చేసిన లైకా ప్రొడక్షన్స్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. టీవీ చానల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై చానల్ యాజమాన్యం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. విడుదలైన మూడు రోజుల్లోనే రూ.128 కోట్లు వసూలు చేసి హిస్టరీ క్రియేట్ చేసింది దర్బార్ మూవీ.

Recent Articles English

Gallery

Recent Articles Telugu