HomeTelugu Trending'మా' ఎన్నికలపై డైరెక్టర్‌ ట్వీట్‌.. వైరల్

‘మా’ ఎన్నికలపై డైరెక్టర్‌ ట్వీట్‌.. వైరల్

Director ajay bhupathi sens
‘మా’ ఎన్నికలను సినీ పరిశ్రమలోని సభ్యులందరూ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొన్నారు. దీంతో ‘మా’ ఎన్నికలపై ఎవరేమి స్పందించినా సరే అది కాస్త సంచలనం అయిపోతుంది. ఈ నేపథ్యంలోనే ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ దర్శకుడు అజయ్‌ భూపతి చేసిన సరికొత్త ట్వీట్‌ ప్రస్తుతం నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది.

“నాకు నచ్చిన ప్యానల్ కి మద్దతిచ్చిన వారికే క్యారెక్టర్లు రాస్తా…(అని నాతో ఇప్పుడే ఒక డైరెక్టర్ అన్నాడు)” అంటూ ట్వీట్ చేశారు అజయ్.. దీంతో ఈ ట్వీట్‌ కాస్త నెట్టింట్లో వైరల్‌గా మారింది. మరోవైపు, అక్టోబర్‌ 10న జరగనున్న ఎన్నికల్లో విజయం సాధించి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించేందుకు ఓ వైపు నుంచి ప్రకాశ్‌రాజ్‌, మరోవైపు నుంచి మంచువిష్ణు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. ‘మా’ బిల్డింగ్‌ నిర్మాణం, సభ్యుల సంక్షేమమే ప్రధాన థ్యేయంగా ఈ రెండు ప్యానల్స్‌ బరిలో పోటీ పడుతున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu