దేశవ్యాప్తంగా కరోనా తాండవం చేస్తోంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించారు. దీంతో దేశంలో క్లిష్ట పరిస్థితులు నెలకొన్నాయి. సామాన్య, మధ్యతరగతి ప్రజలు నిత్యావసరాల కోసం ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు చేపడుతున్నాయి. మరోవైపు వైద్య సహాయం కోసం కూడా రాష్ట్రాలు ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నాయి. కరోనా బాధితుల కోసం తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చేపడుతున్న సహాయ కార్యక్రమాలకు ప్రముఖులు, సినీ రంగానికి చెందినవారు తన వంతు సహాయం చేస్తున్నారు. ఇప్పటికే నితిన్, పవన్ కల్యాణ్ సహా పలువురు తమవంతు సహాయం ప్రకటించారు. తాజాగా ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తనవంతు సాయంగా తెలంగాణకు రూ.10 లక్షలు, ఆంధ్రప్రదేశ్కు రూ.10 లక్షలు విరాళంగా అందించనున్నారు.