HomeTelugu Big Stories'ఫ్యాషన్‌ డిజైనర్‌ - సన్‌ ఆఫ్‌ లేడీస్‌ టైలర్‌'!

‘ఫ్యాషన్‌ డిజైనర్‌ – సన్‌ ఆఫ్‌ లేడీస్‌ టైలర్‌’!

వంశీ దర్శకత్వంలో వచ్చిన అలనాటి మేటి చిత్రం ‘లేడీస్‌ టైలర్‌’ అప్పట్లో విశేష ప్రజాదరణ పొందింది. రాజేంద్రప్రసాద్‌ హీరోగా నటించిన ఆ చిత్రాన్ని ఎప్పటికీ మర్చిపోలేరు తెలుగు ప్రేక్షకులు. ఆ పాత మధురం ‘లేడీస్‌ టైలర్‌’ సినిమాకి సీక్వెల్‌ని రూపొందిస్తున్నారు అభిరుచిగల నిర్మాత మధుర శ్రీధర్‌ రెడ్డి.
‘లేడీస్‌ టైలర్‌’ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించిన లెజెండరీ డైరెక్టర్‌ వంశీనే, ఈ సీక్వెల్‌కి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. సుమంత్‌ అశ్విన్‌, అనీషా ఆంబ్రోస్‌, మనాలి రాథోడ్‌, మానస తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
”నేటి ట్రెండ్‌కి తగ్గట్టుగా ప్రేక్షకుల్ని అలరించే కథ, కథనాలను రంగరించి, ‘ఫ్యాషన్‌ డిజైనర్‌ – సన్‌ ఆఫ్‌ లేడీస్‌ టైలర్‌’ పేరుతో ఈ సీక్వెల్‌ రూపొందుతోంది. అప్పటి లేడీస్ టైలర్ కొడుకు ఇప్పుడు ఏం చేస్తుంటాడు అనే కాన్సెప్ట్ తో రూపొందిన ఈ చిత్రం పాపికొండలు, రాజోలు పరిసరప్రాంతాల్లో నిర్విరామంగా 62 రోజులపాటు షూటింగ్ పూర్తి చేసుకుని ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ వేసవికి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. నవ్వుల వర్షంలో ప్రేక్షులు తడిసి ముద్దయ్యేలా చేయనుంది ‘ఫ్యాషన్‌ డిజైనర్‌ సన్‌ ఆఫ్‌ లేడీస్‌ టైలర్‌’ చిత్రం. ప్రేక్షకులు మనసారా నవ్వుకునేలా ఆద్యంతం ఎంటర్‌టైన్‌మెంట్‌ అందించే ఉద్దేశ్యంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ఇప్పటికే విడుదలైన ప్రీ లుక్‌కి మంచి స్పందన వచ్చింది. మే నెల 3 వారంలో చిత్రాన్ని విడుదల చేయనున్నాం. అలాగే మే నెల మొదటి వారంలో సినిమా మ్యూజిక్‌ లాంఛ్‌ చేయనున్నాం” అని మధుర శ్రీధర్‌ రెడ్డి వెల్లడించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu