ప్రస్తుతం ఉన్న పరిస్థితిని బట్టి నిర్మాతలకు ఓటీటీ ఓ వరంలా మారింది. అమెజాన్, నెట్ ఫ్లిక్స్, ఆహా.. వంటి ఓటీటీ సంస్థలు భారీ మొత్తంలో ఆఫర్ చేస్తూ పలువురు నిర్మాతలను ఆకర్షిస్తున్నాయి. మరీ ముఖ్యంగా, ఇప్పుడు కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో థియేటర్లు బంద్ కావడంతో కొందరు తమ సినిమాలను వీటికి ఇచ్చేస్తూ ఆన్ లైన్ ద్వారా విడుదల చేసేస్తున్నారు.
ఈ క్రమంలో తాజాగా యాక్షన్ హీరో గోపీచంద్ నటించిన ‘ఆరడుగుల బుల్లెట్’ చిత్రం త్వరలో ఓటీటీ లో రిటీజ్ కానుందని తెలుస్తోంది. ప్రముఖ దర్శకుడు బి.గోపాల్ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రంలో గోపీచంద్ హీరోగా రూపొందించి మూడేళ్లయింది. నయనతార హీరోయిన్గా నటించిన ఈ సినిమా విడుదల ఫైనాన్షియల్ సమస్యల వల్ల రెండు మూడు సార్లు వాయిదా పడి.. ప్రాజక్టు స్టేల్ అయిపోయింది. ఇప్పుడు ఓ ఓటీటీ సంస్థ నుంచి మంచి ఆఫర్ రావడంతో నిర్మాతలు కమిట్ అవుతున్నట్టు సమాచారం. త్వరలోనే విడుదల తేదీ తో కూడిన వివరాలను ప్రకటిస్తారు.