HomeTelugu Big Storiesదేశం బాగుపడాలంటే.. హీరో సలహా...!

దేశం బాగుపడాలంటే.. హీరో సలహా…!

11 6

ఈ మధ్య సినిమా నటులను టార్గెట్ చేస్తూ ఐటీ అధికారులు వరుసగా దాడులు చేస్తున్నారు. గత నెలలో హీరోయిన్ రష్మిక ఇళ్లలో సోదాలు చేసిన ఐటీ అధికారులు ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్, బిగిల్ నిర్మాతల ఇళ్లపై దాడులు చేశారు. ప్రస్తుతం విజయ్ ‘మాస్టర్’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. షూటింగ్ జరుగుతుండగానే ఐటీ అధికారులు ఆయన్ను రహస్యంగా తీసుకెళ్లి ప్రశ్నించడంపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఈ విషయం కోలీవుడ్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది.

రూల్స్ ప్రకారం ఐటీ అధికారులు సదరు వ్యక్తులకు, సంస్థలకు నోటీసులు జారీ చేయాలి. ఆ తర్వాత విచారణ నిర్వహించాలి. అయితే ఐటీ అధికారులు చెప్పాపెట్టకుండా విజయ్‌ను షూటింగ్ స్పాట్ నుంచి తీసుకెళ్లి ప్రశ్నించడం ఏంటని కొంతమంది ఇండస్ట్రీ పెద్దలు మండిపడుతున్నారు. ఐటీ అధికారుల దాడులపై హీరో అజిత్ కుమార్ మండిపడ్డారు. ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ధరలను అమాంతం పెంచేసి, పన్నులను భారీగా వేస్తూ ప్రజల డబ్బులను దోచుకుంటున్న
రాజకీయ నాయకులను వదిలేసి సెలబ్రిటీలైన మమ్మల్ని ప్రశ్నించడం, మా ఇళ్లను సోదాలు చేయడం ఏంటని విమర్శించారు. రాజకీయ నాయకుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తే దేశంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయని అజిత్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలను ఫ్యాన్స్ షేర్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu