HomeTelugu Trendingకార్తికేయ-2 నిర్మాతల బడ్జెట్‌ ఎంతో తెలుసా!

కార్తికేయ-2 నిర్మాతల బడ్జెట్‌ ఎంతో తెలుసా!

8 2
యంగ్‌ హీరో నిఖిల్ చందూ మొండేటి దర్శకత్వంలో కొంతకాలం క్రితం తెరకెక్కించిన చిత్రం ‘కార్తికేయ’ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. స్వాతి ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. మంచి వసూళ్లను రాబట్టిన ఆ సినిమాకి సీక్వెల్ చేయడానికి నిఖిల్ – చందూ మొండేటి రంగంలోకి దిగారు. ఈ సినిమాకి ఏషియన్ సునీల్ నిర్మాతగా వ్యవహరించవలసి వుంది. అయితే కథాపరంగా బడ్జెట్ .. నిఖిల్ మార్కెట్ ను మించిపోతుండటంతో వాళ్లు వెనకడుగు వేశారట.

దాంతో ఈ సినిమాను నిర్మించడానికి పీపుల్ మీడియావారు ముందుకు వచ్చారు. 13 కోట్లలోనే ఈ సినిమాను నిర్మించాలనే నిర్ణయానికి వాళ్లు వచ్చినట్టుగా సమాచారం. అయితే అంతమొత్తంలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయగలనా? లేదా? అనే సందేహంతో చందూ వున్నాడని అంటున్నారు. నిఖిల్ కూడా ఇదే విషయాన్ని గురించి ఆలోచిస్తున్నాడని చెబుతున్నారు. నిర్మాతలు మాత్రం తాము చెప్పిన బడ్జెట్ కి కట్టుబడి ఉన్నారట. ఈ విషయంలో నిఖిల్ – చందూ మొండేటి ఏం నిర్ణయించుకుంటారో చూడాలి మరి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu