అక్కినేని నాగ చైతన్య – డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఇదివరకు ప్రేమమ్, సవ్యసాచి సినిమాలు వచ్చాయి. తాజాగా రాబోతున్న మూడో సినిమాలో చైతన్యకు జంటగా తొలుత అనుపమ పరమేశ్వరన్ను హీరోయిన్ గా నటించనున్నట్లు వార్తలు వచ్చాయి.
అయితే, ఇప్పుడు కీర్తిసురేశ్ పేరు తెరపైకి వచ్చింది. ఇటీవలే నానితో కలిసి నటించిన దసరా చిత్రంతో భారీ విజయం సొంతం చేసుకున్న కీర్తిని తీసుకుంటే బాగుంటుందని దర్శకుడు, నిర్మాత అల్లు అరవింద్ నిర్ణయించారని సమాచారం. కథ చెప్పగా కీర్తి సురేశ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టేనని వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మహానటి చిత్రంలో అతిథి పాత్ర చేసిన నాగ చైతన్య.. కీర్తితో కలిసి నటించారు. ఇప్పుడు ఇద్దరు జంటగా నటిస్తే మరో క్రేజీ కాంబినేషన్ ఫ్యాన్స్ని అలరించనుంది.
అనుష్క ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ టీజర్
సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్: భయం కలిగించే చాలా సన్నివేశాలు
బట్టలు లేకుండా హట్ లుక్లో విద్యాబాలన్
హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు
శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు