శర్వానంద్ – సిద్ధార్థ్ హీరోలుగా నటిస్తున్న తాజా చిత్రం ‘మహాసముద్రం’. ఆర్ ఎక్స్ 100′ సినిమాతో భారీ విజయాన్ని నమోదు చేసిన అజయ్ భూపతి, ఆ తరువాత ప్రాజెక్టుగా ఈ సినిమాను పట్టాలెక్కించడానికి చాలా సమయమే పట్టింది. ఇక రెండు ప్రధానమైన పాత్రలకు హీరోలు సెట్ కావడానికి కూడా టైమ్ పట్టింది. అందువల్లనే ఆయన షూటింగు విషయంలో ఆలస్యం చేయలేదు. ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రకారం చకచకా షూటింగు కానిచ్చేశాడు. తాజాగా ఈ సినిమా షూటింగును పూర్తిచేసుకుంది. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ, ఆయన ఒక స్పెషల్ పోస్టర్ ను వదిలాడు.
లవ్, యాక్షన్, ఎమోషన్ ను కలుపుకుంటూ సాగే కథ ఇది. పాత్రల మధ్య సున్నితమైన భావోద్వేగాల ఘర్షణ, సంఘర్షణ కనిపిస్తాయి. అదితీరావు, అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఒక కీలమైన పాత్రను జగపతిబాబు పోషించగా, విలన్ పాత్రలో ‘గరుడ’ రామ్ కనిపించనున్నాడు. త్వరలోనే ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయనున్నారు.
It’s a wrap on #MAHASAMUDRAM 🌊
Coming back to Telugu Cinema after 8 years and I could not have enjoyed myself more!
Thank you @DirAjayBhupathi @ImSharwanand @aditiraohydari and @AKentsOfficial for everything.
See you in cinemas whenever god and gov permits. ❤️🙏🏽 pic.twitter.com/ehrQb1g4t3
— Siddharth (@Actor_Siddharth) July 9, 2021