అక్కినేని నాగచైతన్య, సమంత జంటగా నటిస్తున్న ‘మజిలీ’ సినిమాలోని సెకండ్ లుక్ను చిత్రబృందం ఈరోజు విడుదల చేసింది. భోగి పర్వదినాన్ని పురస్కరించుకుని కొత్త పోస్టర్ను అభిమానులతో పంచుకుంది. లుక్లో చైతూ క్రికెటర్గా కనిపిస్తున్నారు. సినిమాలో రెండో హీరోయిన్గా నటిస్తున్న దివ్యాంశ కౌశిక్ చైతన్యను ఆలింగనం చేసుకున్నట్లుగా కనిపించారు. శివ నిర్వాణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ఫస్ట్లుక్కు విశేష ఆదరణ లభించింది. ఫస్ట్లుక్లో చైతూ, సామ్ జంటగా కనిపించారు. సెకండ్ లుక్లో రెండో కథానాయికను పరిచయం చేశారు. పెళ్లయ్యాక తొలిసారి చై, సామ్ భార్యాభర్తలుగా నటిస్తున్న చిత్రం కావడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. అందులోనూ వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న నాలుగో చిత్రమిది. ఇందులో సామ్ రైల్వే క్లర్క్ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఏప్రిల్లో ఈ సినిమా విడుదల కానుంది.