HomeTelugu Newsవైసీపీ, జేడీ, రాపాకలపై పవన్‌ కల్యాన్‌ కీలక వ్యాఖ్యలు

వైసీపీ, జేడీ, రాపాకలపై పవన్‌ కల్యాన్‌ కీలక వ్యాఖ్యలు

12
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ వైసీపీ, జేడీ లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే రాపాకలను టార్గెట్ చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. బెజవాడ ఈస్ట్, నరసాపురం కార్యకర్తలతో పవన్ భేటీ అయ్యారు. ఆ భేటీలో ఆయన ఈ కామెంట్స్ చేశారు. ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అనడితే ఇస్తే రాష్ట్రం కుదేలైందని ఆయన అన్నారు. వేరే పార్టీకి ఓటేశారని రేషన్ కార్డులు, ఇళ్ళపట్టాలు ఇవ్వని పరిస్థితులు వచ్చాయని పవన్ ఆరోపించారు. కృష్ణానది చెంతనే ఉన్న తాగటానికి నీళ్లు లేవు, ఉన్న నీరు డ్రైనేజీ నీరు కలిసి కలుషితమయ్యాయని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం అంటే ప్రజలందరి కోసం పనిచేయాలని అన్నారు. కులాలు, మతాలు, ప్రాంతాలుగా విడగొడట్టం తేలిక కానీ కలపటమే కష్టమని పవన్‌ అన్నారు.

పార్టీ బలోపేతానికి స్థానిక సంస్థలే అవకాశమని ఒక్కఛాన్స్ పార్టీలా కాకుండా ఛాన్స్ ఇవ్వకపోయినా ప్రజలకు అండగా ఉండాలని అన్నారు. పార్టీలో ఎవరైనా ఇష్టం ఉంటేనే ఉండాలి బలవంతంగా కాదని జేడీని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. పార్టీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే పార్టీలో ఉన్నారో లేదో కూడా తెలియదని రాపాకను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇక కాపలా కాసే రాజకీయాలు చేయనన్న ఆయన పార్టీకి రాజీనామా చేసి వెళ్తూ నాపై విమర్శలు చేశారని అన్నారు. విమర్శలు చేసే వారు వెయ్యి రూపాయలు సమాజం కోసం వదులుకోగలరా ? అని పవన్‌ ప్రశ్నించారు. నాపై ఆధారపడ్డ వారికోసం, కుటుంబం కోసమే సినిమాలు చేస్తున్నానని అన్నారు. వేల కోట్ల ఆస్తి, నెలకు ఓ కోటి వస్తే నేను సినిమాలు చేసే వాడిని కాదని పవన్‌ కల్యాణ్‌ అన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu