HomeTelugu Trendingఓటీటీలో దృశ్యం-2 సురేష్‌ బాబు క్లారిటీ

ఓటీటీలో దృశ్యం-2 సురేష్‌ బాబు క్లారిటీ

Producer suresh babu clarit

అనుకోకుండా చిక్కుకున్న ఓ హత్య కేసు నుంచి తన కుటుంబాన్ని, ముఖ్యంగా తన కూతురిని ఓ తండ్రి ఎలా రక్షించుకున్నాడు అనే కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రం. విక్టరీ వెంకటేష్‌, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘దృశ్యం’. సినిమాకి సీక్వెల్‌గా దృశ్యం-2 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మలయాళంలో డైరెక్ట్‌ చేసిన జీతూ జోసఫే తెలుగు రీమేక్‌ను కూడా తెరకెక్కిస్తునన్నారు. సురేశ్‌బాబు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

ఈ సినిమా మలయాళంలో కేవలం 45 రోజుల్లో మాత్రమే షూటింగ్‌ పూర్తి చేసుకొని, ఫిబ్రవరి 19న ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో విడుదలైంది. అక్కడ ఈ మూవీకి మంచి స్పందన రావడంతో, అదే సినిమాను తెలుగులో వెంకటేశ్‌తో రీమేక్‌ చేశారు. ఇప్పటికే షూటింగ్‌ కూడా పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. ఇలాంటి తరుణంలో దృశ్యం-2 సబంధించిన ఓ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ఈ సినిమా నేరుగా ఓటీటీలో రిలీజ్‌ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఓటీటీ ఫ్లాట్ ఫామ్ కి చెందిన ఒక ప్రముఖ సంస్థవారు భారీ ఆఫర్ ఇవ్వడంతో నిర్మాతలు అంగీకరించారనీ, త్వరలోనే ఈ సినిమా ఓటీటీ సంస్థలో విడుదల కానుందని పుకార్లు వచ్చాయి. వీటిపై తాజాగా నిర్మాత సురేష్‌ బాబు స్పందించారు. ఓటీటీలో విడుదల అనేది కేవలం పుకారు మాత్రమేనని, తాము ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. తామే స్వయంగా చెప్పే వరకు ఇలాంటి ప్రచారాలను నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu