టాలీవుడ్ బడా నిర్మాత సురేశ్బాబుకు ఓ కేటుగాడు టీకాలు ఇప్పిస్తానంటూ టోకరా ఇచ్చాడు. 500 డోసుల టీకాలు ఉన్నాయని సురేశ్బాబుకు నాగార్జున రెడ్డి అనే వ్యక్తి ఫోన్ చేశాడు. తన భార్య బ్యాంకు ఖాతాకు రూ.లక్ష బదిలీ చేయాలని కోరాడు. అతడి మాటలు నమ్మి రూ.లక్ష బదిలీ చేశారు సురేశ్బాబు. అయితే, తర్వాత ఎన్ని సార్లు ఫోన్ చేసినప్పటికీ లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చి, చివరికి మోసం జరిగిందని తెలుసుకున్నారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు