పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వస్తున్న తాజా సినిమా ‘ఫైటర్’. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను, తెలుగుతో పాటు ఇతర భాషల్లోను విడుదల చేయాలనే నిర్ణయంతో ఉన్నాడు ఈ దర్శకుడు. యూత్ లో ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి. పూరి నెక్ట్స్ ఏ హీరోతో సినిమా చేయనున్నడనే విషయంపై అభిమానులు ఆసక్తిని కనబరుస్తున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా బాలకృష్ణ పేరు తెరపైకి వచ్చింది. గతంలో బాలకృష్ణతో ‘పైసా వసూల్’ చేసిన పూరి, తాజాగా బాలకృష్ణకి ఫొన్ చేసి కథ వినిపించాడట. కథ నచ్చడంతో బాలయ్య వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. ‘ఫైటర్’ పనులు పూర్తి కాగానే బాలకృష్ణ ప్రాజెక్టును పట్టాలెక్కించే ప్లాన్ చేసుకుంటున్నాడట పూరి. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.