HomeTelugu Trendingరోబో 2.0 గురించి డిస్ట్రిబ్యూటర్ల భయం

రోబో 2.0 గురించి డిస్ట్రిబ్యూటర్ల భయం

5 27

శంకర్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్‌ హీరోగా వచ్చిన రోబో 2.ఓ సినిమాను.. ‘రోబో 2.ఓ: రీసర్జెన్స్‌’ అని మార్చి.. జులై 12న చైనాలో 56,000 స్క్రీన్లపై విడుదల చేయాలని హెచ్‌వై మీడియా సంస్థ నిర్ణయించుకుంది. అయితే ఆ సినిమా విడుదలయ్యే అవకాశాలు లేవని వార్తలు వస్తున్నాయి. సినిమాను చైనాలో విడుదల చేస్తే డిస్ట్రిబ్యూటర్లకు మరింత నష్టం వాటిల్లే అవకాశం ఉందని హెచ్‌వై మీడియా సంస్థ భావిస్తోందట. ఎందుకంటే అక్షయ్‌కుమార్‌ నటించిన ప్యాడ్‌మ్యాన్‌ సినిమా అక్కడ డిజాస్టర్ అయింది. సినిమా విడుదల చేయడానికి అయిన ఖర్చును కూడా భర్తీ చేయలేకపోయింది. దాంతో 2.ఓ సినిమా కూడా నష్టం కలిగిస్తుందేమోనని డిస్ట్రిబ్యూటర్లు భయపడుతున్నారు.

చైనాలో 2.ఓ ను విడుదల చేస్తే 25 మిలియన్‌ డాలర్లు వసూలు చేయాలి. అప్పుడే డిస్ట్రిబ్యూటర్లకు నష్టం వాటిల్లదు. అదీకాకుండా ది లయన్‌ కింగ్‌ సినిమా కూడా జులైలోనే విడుదల అవుతున్న నేపథ్యంలో రిస్క్‌ ఎందుకని భావించిన డిస్ట్రిబ్యూటర్లు 2.ఓ విడుదలను రద్దు చేయాలని అనుకుంటున్నారట. అయితే ఈ విషయం గురించి చిత్ర బృందం
నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ చిత్రంలో అమీ జాక్సన్‌ హీరోయిన్‌ కాగా.. బాలీవుడ్ హీరో అక్షయ్‌ కుమార్‌ విలన్ పాత్రను పోషించారు. రూ.300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదలైంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!