HomeTelugu Trending'దర్బార్' మూవీ యూనిట్‌పై దాడి?

‘దర్బార్’ మూవీ యూనిట్‌పై దాడి?

4 1సూపర్‌స్టార్‌ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న ‘దర్బార్’ మూవీ యూనిట్‌పై దాడి జరిగినట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం ముంబయిలో జరుగుతోంది. ఓ కళాశాలలో పలు సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఎలాంటి సీన్లు బయటికి రాకుండా చిత్రబృందం జాగ్రత్తలు తీసుకుంది. కళాశాలలో చిత్రీకరణ జరుగుతుండడంతో విద్యార్థులు షూటింగ్‌ చూసేందుకు ఎగబడ్డారు. దాంతో చిత్రబృందం వారిని దూరంగా ఉండాలని సూచించింది. ఈ క్రమంలో చిత్రబృందానికి, విద్యార్థులకు మధ్య ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది. దాంతో చిత్రబృందంపై వారు రాళ్లు రువ్వినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో దర్శకుడు మురుగదాస్‌ ఈ విషయం గురించి కళాశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేశారట. అంతేకాదు.. వెంటనే షూటింగ్‌ లొకేషన్‌లో మార్పులు చేయాలని నిర్ణయించుకున్నారట. అయితే ఈ విషయం గురించి చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ‘దర్బార్‌’ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటిస్తున్నారు. అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందిస్తున్నారు. ఇందులో తలైవా ఖాకీ గెటప్‌లో కనిపించనున్నారు. 2020 సంక్రాంతికి సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu