HomeTelugu Big Stories'2.0' డబ్బింగ్ పనులు షురూ!

‘2.0’ డబ్బింగ్ పనులు షురూ!

శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘2.0’ షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం డబ్బింగ్ పనులు జరుగుతున్నాయి. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఒకేసారి ఈ సినిమాను విడుదల చేయనున్నారు. అందువలన ఈ మూడు భాషల్లో ఒకేసారి డబ్బింగ్ పనులు జరుపుతున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. లైకా ప్రొడక్షన్స్ వారు దాదాపు 400 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే.
రజనీ, అక్షయ్ కుమార్, అమీ జాక్సన్ ప్రధానమైన పాత్రలను పోషిస్తున్నారు. ‘బాహుబలి 2’ తరువాత అంతకన్నా ఎక్కువ బడ్జెట్ తో వస్తోన్న సినిమా కావడం అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమా బాహుబలిని మించి ఆడుతుందా..? లేదా..? అనే ఆతురత అందరిలో కలుగుతోంది. 

Recent Articles English

Gallery

Recent Articles Telugu