యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాధాకృష్ణ డైరెక్షన్లో ఒక సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాకు రాధే శ్యామ్ అనే టైటిల్ ని పరిశీలనలో ఉంది. ఇక పాన్ ఇండియా తరహాలో సినిమా తెరకెక్కుతోంది. కాగా ఆ సినిమాలో గెస్ట్ రోల్లో రానా కనిపించబోతున్నడట. కేవలం రానా కొన్ని నిమిషాలు మాత్రమే రానా ఈ సినిమాలో కనిపిస్తాడట. కాగా ఈ పాత్ర కోసం మొదట యాక్షన్ హీరో గోపిచంద్ ని అనుకున్నారట. అయితే ప్రభాస్ ఆలోచన ప్రకారం రానా చేస్తేనే బెటర్ అని దర్శకుడికి వివరించగా స్క్రిప్ట్ లో కూడా మార్పులు చేసినట్లు తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇక వీలైనంత వరకు కరోనా పూర్తిగా తగ్గిన తరువతే ఈ సినిమాను విడుదల చేయాలని ప్రభాస్ అనుకుంటున్నాడట. వచ్చే సమ్మర్లో విడుదల చేసే యోచనలో ఉన్నరట.