HomeTelugu Newsఅరణ్యకి కరోనా సెగ

అరణ్యకి కరోనా సెగ

1 15

భారత్‌లో ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 100కి పైగా చేరాయని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ అధికారంగా ప్రకటించింది. భారత్ లో రెండు కరోనా మరణాలు ఇప్పటివరకు నమోదయ్యాయి. అయితే ఈ నేపథ్యం దాదాపు ఇప్పటికే స్కూల్స్, కాలేజీలు, సినిమా థియేటర్లు కరోనా దృష్ట్యా మూతపడ్డాయి. సినిమా రంగం పై కూడా ఈ ప్రభావం ఎక్కువేగా ఉంది. తాజగా దగ్గుపాటి రానా నటించిన ‘అరణ్య’ సినిమా కూడా వాయిదా పడింది.

ఈ సినిమా తెలుగు తమిళ హిందీ బాషలలో ఒకేసారి విడుదల కానుంది. అయితే ఏప్రిల్ 2వ తేదీన విడుదల కావాల్సిన ఈ చిత్రం రీలీజ్‌ డేట్‌ని వాయిదా వేయడం జరిగింది. కరోనా ఎఫెక్ట్ దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా విడుదలను నిలిపివేస్తున్నట్లు మూవీ నిర్మాతలు తెలిపారు. దేశంలో కరోనా పరిస్థితులు సర్దుమనిగిన తరువాతే ఈ చిత్రాన్ని ఏప్రిల్ ఆఖరులోపు రీలీజ్‌ చేస్తామని అప్పటికి కాకపోతే మే నెలలో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu