HomeTelugu Trendingఫేస్‌బుక్‌లో ప్రభాస్‌ ఫోస్ట్‌ 'సాహో' నుండి సర్‌ప్రైజ్‌

ఫేస్‌బుక్‌లో ప్రభాస్‌ ఫోస్ట్‌ ‘సాహో’ నుండి సర్‌ప్రైజ్‌

2 23యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ ప్రస్తుతం ‘సాహో’ ప్రమోషన్‌ కార్యక్రమాల్లో బిజీగా గడుపుతున్నారు. అయితే ఈరోజు ప్రభాస్‌ తన అభిమానులకు సోషల్‌మీడియా ద్వారా సర్‌ప్రైజ్‌ను ఇచ్చారు. ‘సాహో’లోని నాలుగో పాటను ఈరోజు విడుదల చేయబోతున్నట్లు ఆయన తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ‘బేబీ ఓన్ట్‌ యు టెల్‌ మీ..’ అంటూ సాగే ఈపాటకు సంబంధించిన పోస్టర్‌ను పోస్ట్‌ చేస్తూ ‘సాహో’ ప్రపంచాన్ని వీక్షించేందుకు రెడీగా ఉండండి అంటూ క్యాప్షన్‌ ఇచ్చారు. ఈ పోస్టర్‌ అభిమానులను ఆకట్టుకుంటోంది.

దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రం ‘సాహో’. ఇందులో రూ.2 వేల కోట్ల దోపిడికి సంబంధించిన కేసును ఛేదించే అండర్‌ కవర్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా ప్రభాస్‌ కనిపించనున్నారు. సుజిత్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ద్వారా బాలీవుడ్‌ తార శ్రద్ధాకపూర్‌ తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. బాలీవుడ్‌ తార జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌ ఒక ప్రత్యేక గీతంలో కనిపించనున్నారు. నీల్‌ నితిన్‌ ముఖేష్‌, జాకీ ష్రాఫ్‌, వెన్నెల కిశోర్‌, అరుణ్‌ విజయ్‌, మందిరా బేడీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమా ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu