సినీనటుడు సోనూసూద్ కరోనా విపత్కర పరిస్థితుల్లో చేసిన సహాయాల గురించి అందరికీ తెలిసిందే. ముంబైతోపాటు వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న వలస కార్మికులను సురక్షితంగా ఇంటికి పంపించిన సోనూసూద్ని నెటిజన్లు, రాజకీయ నాయకులు ప్రసంశించారు. వలసకార్మికులను తమ స్వగ్రామాలకు పంపించేందుకు సోనూ బస్సులు, రైళ్లతోపాటు విమాన సౌకర్యాలను కూడా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ మధ్యే దక్షిణ అమెరికాలో చిక్కుకపోయిన 100 మంది వైద్య విద్యార్థులను తిరిగి ఇండియాకు తీసుకువచ్చే మిషన్ ను చెప్పటారు.
అయితే తాజాగా తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ చేశాడు. ఆయన తాజాగా చేసిన ట్విట్ లో ”1137 మెయిల్స్, 19వేలు ఫేస్బుక్ మెసేజ్లు, 4812 ఇన్స్టా మెసేజ్లు, మరో 6741 ట్విటర్ మెసేజ్లు నాకు ఈ రోజు సహాయం కోరుతూ వచ్చాయి. నాకు సగటున రోజుకు ఇన్ని అభ్యర్థనల సహాయం కోసం వస్తున్నాయి. అయితే, ప్రతిఒక్కరినీ చేరుకోవడం అసాధ్యమని ఆయన చెప్పాడు. తనకు వీలైనంత మేరకు సాయం చేయడానికి ప్రయత్నిస్తానని తెలిపాడు. ఎవరి మెసేజ్లయినా మిస్ అయితే క్షమించాలని ఆయన కోరాడు. కాగా, సోను సూద్కు అన్ని వర్గాల ప్రజల నుంచి మెసేజ్లు వస్తున్నాయి. తమకు ల్యాప్టాప్లు పంపాలని కూడా విద్యార్థులు అడుగుతుండడం గమనార్హం.
1137. mails.
19000. fb messages
4812. Insta messages
6741. twitter messages.Today’s HELP messages.
On an average these are the number of requests I get for HELP. It is humanly impossible to reach out to everyone. I still try my best.
Apologies if I missed your message🙏— sonu sood (@SonuSood) August 20, 2020